37.2 C
Hyderabad
May 2, 2024 12: 46 PM
Slider గుంటూరు

యాజిటేషన్: అమరావతి ఉద్యమానికి కదలిరండి

chadalavada 18

స్థానిక అరండల్ పేట సిపిఐ కార్యాలయంలో అమరావతి రాజధాని నేడు జేఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జేఏసీ నాయకులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ రాజధాని రైతులు గత అరవై మూడు రోజుల నుండి శాంతియుత మార్గంలో నిరసనలు శాంతియుత  ఉద్యమాలు నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు అని ఎద్దేవా చేశారు.

3 రాజధానులు వద్దు అమరావతి ముద్దు అనే నినాదంతో జేఏసీ ఆధ్వర్యంలో నరసరావుపేట నియోజకవర్గం లో గ్రామ గ్రామానికి అమరావతి నినాదం ఉద్యమాన్ని ఉధృతం చేయాలని అని పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కసా రాం బాబు మాట్లాడుతూ ఈ నెల 25న గుంటూరులో జరిగే అమరావతి పరిరక్షణకై జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని అన్నారు.

జేఏసీ సమావేశం ఉప్పలపాటి రంగయ్య అధ్యక్షత వహించగా ఈ సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోదా జాన్ పాల్,సీపీఐ రొంపిచర్ల మండల కార్యదర్శి సత్యనారాయణ రాజు, యువజన విద్యార్థి నాయకులు వైదన వెంకట్, గుండాల హర్ష,సీపీఐ నాయకులు చిన్న జాన్ సైదా, పున్నయ్య, జక్రం, జేఏసీ నాయకులు రాయప్ప, ఏ వి ఆర్, పేతురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Related posts

ఆర్టీసీ కార్మికులు, మీడియాపై పోలీసు జులూం

Satyam NEWS

స్వీట్ ఫ్లూట్:అలరించిన జయప్రద రామ్మూర్తి వేణుగానం

Satyam NEWS

పిఎమ్-వాణి బిజినెస్ ప్రమోషన్ ఎక్స్ పీరియన్స్ సెంటర్ ప్రారంభం

Satyam NEWS

Leave a Comment