33.2 C
Hyderabad
May 4, 2024 00: 48 AM
Slider శ్రీకాకుళం

కుటుంబంపైనే కత్తి: భార్య, చెల్లి మృతి

#daylightmurder

శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఎచ్చెర్ల మండలం ముద్దాడపేట లో సొంత కుటుంబ సభ్యులపై రీసు అప్పన్న అనే వ్యక్తి విచక్షణారహితంగా కత్తితో దాడి చేసాడు. ఈ ఘటనలో అప్పన్న భార్య అక్కమ్మ, ఆయన సోదరి చెల్లుబోయిన రాజు అక్కడికక్కడే మృతిచెందారు. నిందితుని తండ్రి, మరో ఇద్దరి కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులపై దాడి చేసిన అనంతరం నిందితుడు అప్పన్న కత్తితో పొడుచుకున్నాడు. నిందితుడు అప్పన్న కల్లు గీత కార్మికుడు. రక్తపు మడుగులో అప్పన్న కుటుంబం ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ కలహాలు నేపథ్యం ఈ ఘటనకు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు.

Related posts

గీతోపదేశం క్యాలెండర్ లో మోడీ అమిత్ షా

Satyam NEWS

ప్రశాంతంగా పోలింగ్ ముగియడానికి ఎస్పీ వ్యూహం…!

Satyam NEWS

జూన్ 21న శ్రీ‌వారి ఆల‌యంలో గ్రహణ శుద్ధి

Satyam NEWS

Leave a Comment