ఉప్పల్ నియోజకవర్గంలోని శ్రీ సాయి కృష్ణ సంక్షేమ సంఘం కుషాయిగూడ అధ్యక్షుడిగా డాక్టర్ వర్కుటి కుమారస్వామి ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రీ సాయి కృష్ణ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ వర్కుటి కుమారస్వామి కి CCS అభినందన తెలిపింది. చర్లపల్లి కాలనీల సమాఖ్య CCS అడ్మిన్ ఎంపల్లి పద్మా రెడ్డి
మంగళవారం సాయంత్రం ఆయనను కలిసి శాలువాతో అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధ్యమైనంత తొందరలో వెల్ఫేర్ సొసైటీ కి పూర్తిస్థాయి కమిటీ ఏర్పాటు చేసుకొని అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు.
సత్యంన్యూస్, మేడ్చల్ జిల్లా