మంచినీటి , డ్రైనేజ్ సమస్యల పరష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ మల్లాపూర్ డివిజన్ కార్పొేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం మల్లాపూర్ వార్డ్ ఆఫీసులో జిహెచ్ఎంసి అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మంచినీటి, డ్రైనేజ్ సమస్యల పరష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. డ్రైనేజ్ సమస్యలను గుర్తించి ప్రతి ప్రతిపాదనలను వెంటనే సిద్దం చేయాలని కోరారు. మంచినీటి సరఫరా ఏరియా లైన్మెన్లతో లీకేజీలు , కలుషిత జలాలను అరికట్టాలని సూచించారు. ఈ సమావేశంలో జలమండలి డీజీఎం. సతీష్ కుమార్, మనేజర్. సందీప్ కుమార్ మరియు లైన్మెన్ల పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి