38.2 C
Hyderabad
May 5, 2024 22: 29 PM
Slider ముఖ్యంశాలు

ఆసిఫాబాద్ అడవుల్లో కూంబింగ్ కొనసాగుతుంది

#AsifabadPolice

అదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ కొమరం భీమ్ అటవీ ప్రాంతంలో నిన్న రాత్రి ప్రాణహిత నది తీరం వెంబడి పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయని అసిఫాబాద్ కొమరం భీమ్ ఇంచార్జ్  ఎస్పి, రామగుండం కమిషనరేట్ సిపి వి సత్యనారాయణ తెలిపారు.

ఎదురు కాల్పుల్లో ఇద్దరు మంగి దళ కోయ మావోయిస్టు ఒకరు మహిళా మావోయిస్టు ఒకరు మృతి చెందినట్లు ఆయన తెలిపారు. ఈ ఎన్ కౌంటర్ సమయంలో తెలంగాణ కీలకనేత భాస్కర్ అలియాస్ తప్పించుకున్నట్లు చెప్పారు.

గత కొన్ని రోజుల నుండి కూడా ఉమ్మడి అదిలాబాద్ జిల్లా అటవీ ప్రాంతంలో  పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.

మావోయిస్టులు అలజడి సృష్టిస్తున్నారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే  అవకాశం ఉన్నట్లు గుర్తించామని ఆయన తెలిపారు. అదనపు బలగాలు కూడా వస్తున్నట్లు ఆయన వివరించారు.

Related posts

కాంగ్రెస్ నేత రామచంద్రారెడ్డి హత్యపై విచారణ జరపాలి

Satyam NEWS

30న ఏలూరులో బిజిలి మహోత్సవం

Satyam NEWS

దొంగ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

Satyam NEWS

Leave a Comment