తమ ఒంట్లోని నరాలన్ని దారాలుగా పొగుచేసి చెమటను రంగులుగా అద్ది వస్త్రంగా మలిచే చేనేత కళాకారులకు, ఆధారిత కార్మికులకు ఓజో ఫౌండేషన్ అధినేత పిల్లుట్ల రఘు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు.
ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ ప్రతి మనిషికీ కూడుతో పాటు గుడ్డ కూడా ప్రాధమిక అవసరమని, మన దేశంలో వ్యవసాయం తర్వాత రెండో అతిపెద్ద ఉపాధి అవకాశాలు చేనేత రంగంలోనే ఉన్నాయని,కానీ మరమగ్గాల ధాటికి చేనేత మగ్గాలు కుదేలైపోయిందని, చేనేత రంగంపై ఆధారపడిన వారి పరిస్థితి రోజు రోజుకీ దుర్భరంగా మారుతోందని,చేనేత రంగాన్ని,నేతన్నలను ఆదుకోవడంతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని రఘు తెలిపారు.
భారత స్వాతంత్ర ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించి,స్వతంత్య్ర పోరాటంలో ముఖ్య సాధనంగా నిలిచింది చేనేత రంగమని,అంతటి ప్రాధాన్యత కలిగిన చేనేత రంగానికి ప్రత్యేకంగా ఒక రోజు ఉండాలన్న ఉద్దేశ్యంతో జాతీయ భారత చేనేత లోగోను ఆవిష్కరించడమే కాకుండా ఆగస్టు 7వ,తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా పరిగణిస్తున్నట్లు రఘు వివరించారు.
హుజూర్ నగర్ సత్యం న్యూస్