కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని గుండె కల్లూరు గ్రామానికి చెందిన కర్రెవార్ యదిగొండ (45) విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందినట్లు ఎస్సై శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం రైతు తన పంట చేనులోని సోయ పంటలను అడవి పందుల దాడి నుండి కాపాడుకునేందుకు పంట చేను చుట్టూ విద్యుత్ తీగలు అమర్చారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి తాను వేసిన విద్యుత్తు తీగను గమనించకుండా చేనులోకి వెళ్లడంతో విద్యుత్ తీగ కాలికి తగిలి కరెంటు షాక్ తో పొలంలో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో మృతిని భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమన్నారు. అదేవిధంగా మండల పరిధిలోని రైతులు తమ వ్యవసాయ పొలాలకు అడవి జంతువుల నుంచి రక్షణ కొరకు కరెంటు తీగలు ఏర్పాటు చేసినచో ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది కావున ఎవరు కూడా ఇలా విద్యుత్ వైర్లను ఏర్పాటు చేయరాదని ఎస్సై వివరించారు.
జి లాలయ్య సత్యం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం