34.7 C
Hyderabad
May 5, 2024 00: 40 AM
Slider ఆదిలాబాద్

కరోనా జయించి విధుల్లో చేరిన నిర్మల్ DSP ఉపేంద్ర రెడ్డి

#NirmalDSP

21 రోజుల క్రితం COVID-19 బారిన పడిన కోలుకున్న నిర్మల్ సబ్ – డివిజన్ DSP ఉపేంద్ర రెడ్డి విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు నిర్మల్ సబ్–డివిజన్ పోలీసు అధికారులు ఘన స్వాగతం పలికారు.

కరోనాను జయించిన డిఎస్పీని శాలువతో సన్మానించారు. లాక్డౌన్ అమలు, కరోనా వైరస్ నిర్ములనలో జిల్లా పోలీసు నిర్విరామంగా పనిచేసింది.

విధుల నిర్వహణలో జిల్లా పోలీసు అధికారులు/సిబ్బంది కరోనా వైరస్ కు గురయ్యారు. మనోధైర్యం ఉంటే ఎలాంటి వ్యాధులనైనా జయించవచ్చునని ఈ సందర్భంగా డిఎస్పీ అన్నారు.

మంచి ఆహారం తీసుకోవడం, వైద్యులు చూపించిన మందులు సక్రమంగా వేసుకోవడం వల్ల కరోనా నుండి త్వరగా కొలుకుంటున్నారు అన్నారు. ప్రజలు దైర్యంగా ఉండాలని అన్నారు.

కరోనా వ్యాప్తి చెందుతున్న క్రమంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని బయటకు వెళితే మాస్క్ లు వాడాలని అన్నారు.

 ఈ కార్యక్రమంలో నిర్మల్ పట్టణ సిఐ శ్రీనివాస్, గ్రామీణ సిఐ వెంకటేష్, సొన్ సిఐ జీవన్ రెడ్డి, నిర్మల్ సబ్–డివిజన్ పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

మహిళా సంరక్షక పోలీసులతో మమేకమైన ఎస్పీ

Sub Editor

పల్నాడు జిల్లాలో అక్రమ రేషన్ బియ్యం దందా

Bhavani

ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పి తాగించండి

Satyam NEWS

Leave a Comment