తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజలకు అండగా ఉంటున్న భారతీయ జనతా పార్టీకి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి మార్గదర్శనం మరింత ఉపయోగపడుతున్నదని బిజెపి మైనారిటీ నాయకుడు షేక్ రహమ్మతుల్లా తెలిపారు.
నేడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన ఆయన శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలలో బిజెపి విజయపథంలో నడిచేందుకు తన వంతు సాయం చేస్తానని రహమ్మతుల్లా తెలిపారు.
దేశాన్ని క్లిష్ట సమయంలో కూడా ముందుకు నడిపిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ ప్రపంచానికే ఆదర్శప్రాయుడయ్యారని రహమ్మతుల్లా తెలిపారు.