భాగ్యనగరం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. నల్లకుంట డివిజన్ లోని శ్రీ శ్రీ నల్లపోచమ్మ నాగ దేవత ఆలయం లో గణేష్ ప్రతిమను ఏర్పాటు చేసి వైభవంగా నవరాత్రులు నిర్వహించారు.
నేడు నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నల్లకుంట డివిజన్ కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవి రమేష్ పాల్గొని పూజలు చేశారు.
కార్పొరేటర్ తో బాటు లలిత, భవాని, వాణి, స్రవంతి, పద్మ, అనిత, తరుణ్, మహేష్, మనీష్, వరుణ్, సతీష్, రాహుల్, బంటి, వర్ధన్, బసవరాజు పంతులు, జె.సతీష్ తదితరులు పాల్గొన్నారు. నిమజ్జన కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగింది.