నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో కరోనా బారిన పడిన20 మంది బాధితులకు మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలు పండ్లు కూరగాయలు గుడ్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పాలమూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోని అన్ని దేశాలను వణికిస్తున్న కరోనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అదేవిధంగా ముఖానికి మాస్క్ లు ధరించాలని స్వీయ నియంత్రణ పాటించాలని అవసరమైతే తప్ప బయటకి రా రాదని ఆయన పేర్కొన్నారు.
వృద్ధులు పిల్లలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాలకృష్ణ ,సుదర్శన్, శీను, అల్లా జి ,బాల్ జంగి పరుశురాం, తదితరులు పాల్గొన్నారు.