సీఎం సహాయనిధి కింద అందించే సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆపద సమయాల్లో వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిది ఆపద్భందులగా ఆదుకుంటుందని నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి గ్రామానికి చెందిన G.వెంకటస్వామి s/o G.కిష్టయ్య హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో మోకాళ్ళకు సంబంధించిన ఆపరేషన్ చేయించుకునేందుకు సీఎం సహాయనిధి కింద మంజూరైన రూ.1,00,000/- ల ఎల్వొసిని ఈ రోజు ఎమ్మెల్యే అందచేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి కింద చికిత్సకు తగిన ఆర్థిక సాయం బాధితులకు అందిస్తోందని అన్నారు. తమ ఆర్థిక పరిస్థితిని గమనించి లక్ష రూపాయల LOC ని మంజూరు చేయించిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కి వెంకటస్వామి కుటుంబసభ్యులు ధన్యవాదాలు తెలిపారు.