చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ పేలిన దుర్ఘటనలో ఇద్దరు సజీవదహనం అయ్యారు. చిత్తూరు జిల్లా, కుప్పం మండలం, తంబిగానిపల్లి వద్ద ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మరణించిన ఇద్దరిని కుప్పం మండల పరిధిలోని రాగిమానుమిట్ట కు చెందిన ఆన్సర్, ఆజాద్ గా పోలీసులు గుర్తించారు.
ట్యాంకర్ కింది భాగంలో భాగంలో వెల్డింగ్ చేస్తుండగా ఒక్కసారిగా సిలిండర్ పేలడంతో ఈ ఘటన జరిగింది. పేలుడుకు మృతదేహలు చిన్నాభిన్నమై పోయాయి. కుప్పం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.