లాక్ డౌన్ లో జిహెచ్ఎంసి కార్మికులు కరోనాని కూడా లెక్కచేయకుండా నిత్యం ప్రజల సేవలో నిమగ్నమై ఉండగా కొంతమంది రాక్షసులు అన్యాయంగా వారిపై దాడి చేస్తున్నారు.
గురువారం తెల్లవారుజామున అంబర్పేట్ డివిజన్ మున్సిపల్ గ్రౌండ్స్ వద్ద చెత్త వేస్తున్నా స్థానికులను అక్కడే ఉన్న జిహెచ్ఎంసి ఎస్ఎఫ్ఏ ఉద్యోగి బాషా ఇక్కడ చెత్త వేయకూడదని స్థానికంగా నివసిస్తున్న మాజర్,అజార్లను కోరారు.
నువ్వు మాకే చెప్తావాని ఆవేశానికి లోనైనా ఇద్దరూ ఒక్కసారిగా అతనిపై దాడి చేసి గాయపరిచారు. దీంతో బాషా స్థానిక అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో వారి పై ఫిర్యాదు చేశారు.
పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.