38.2 C
Hyderabad
May 3, 2024 22: 14 PM
Slider హైదరాబాద్

జీహెచ్ఎంసీపై బీజేపీ జెండా

Kishan-Reddy-campaign

జీహెచ్ఎంసి ఆఫీస్ పై బీజేపీ జెండా ఎగరేస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్న ఆయన కాచిగూడ డివిజన్ లో సుడిగాలి పర్యటన చేశారు. కాచిగూడ డివిజన్ బీజేపి అభ్యర్ధి ఉమా రమేష్ యాదవ్ తరుపున ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు.

ఆద‌రా బాద‌రా వ‌ర‌ద స‌హాయం

గత ఎన్నికల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత హమీలను పూర్తిగా మర్చిపోయారని టీఆర్ఎస్ పాలనను దుయ్యబట్టారు. వర్షాల బాధితులకు రూ.10 వేల ఆర్ధిక సాయం ఆదర బాదరాగా ఇష్టానుసారం పంచారని ఆయన విమర్శించారు. 40మంది హైదరాబాద్ వరదల్లో చనిపోయారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

మూసీ అభివృద్ది ఏదీ?

టీఆర్ఎస్ నేతలు 4 వేల కోట్ల తో మూసిని అభివృది చేస్తామ‌న్నారు. అభివృద్ది ఎక్క‌డోనో చూపించాల‌న్నారు ఓట్లు మాత్రం వేయించుకుని ప్రజలను మోసం చేశారని ఆయన ఆరోపించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి హైదరాబాద్ లో అభివృద్ధి పనులకు 67వేల కోట్లు ఖర్చు చేశామంటున్నారు? అవి ఏ ప్రాతిప‌దిక మేర ఖ‌ర్చు చేశారు? ఎవరికి ఇచ్చారు? వెల్ల‌డించారు. ఎవరి జేబులోకి వెళ్లాయో చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

ఎంఐఎంతో క‌లిసి విద్వేషాలు రెచ్చ‌గొడుతున్న టీఆర్ఎస్‌

ఎంఐఎంతో కలిసి టిఆర్ఎస్ నేతలు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని.. అందుకే టీఆర్ఎస్ ను ప్రజలు ఎవరూ నమ్మొద్దని ఆయన సూచించారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ని గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని కిష‌న్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు.

Related posts

సమాజహితం కోసం బ్రహ్మకుమారిల కృషి అభినందనీయం

Satyam NEWS

వృద్ధులు మ‌న‌కు భారం కాదు.. మార్గ‌ద‌ర్శ‌కులు

Satyam NEWS

ఎదురు చూసే రోజులకు నూకలు చెల్లాయి

Satyam NEWS

Leave a Comment