37.2 C
Hyderabad
May 2, 2024 14: 35 PM
Slider హైదరాబాద్

ఆర్కేపురంలో కొనసాగుతున్నటీఆర్ఎస్‌ ప్రచారం!

RK puram TRS

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో భాగంగా రామకృష్ణాపురం (ఆర్కే) డివిజన్ టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్ అభ్యర్థి మురుకుంట్ల విజయా భారతి అరవింద్ తరఫున తుక్కుగూడ మున్సిపాలిటీ చైర్మన్‌ మధుమోహన్‌, కౌన్సిలర్లు బాదావత్‌ రవినాయక్‌, రెడ్డిగళ్ల సుమన్‌ సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ స్నేహ సురేష్, టీఆర్‌ఎస్‌ నాయకులు ముచ్చ శేఖర్ రెడ్డి, జమాల్‌పూర్‌ ప్రశాంత్‌, వినోద్‌కుమార్‌, రాజ్ కుమార్, భరత్ రాథోడ్‌, మహిళా నాయకులు పద్మ, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

ఆర్కేపురం డివిజన్‌లో ఇంటింటికి వెళ్లి.. ప్రజలను పలుకరించి.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలను చైర్మన్‌, కౌన్సిలర్లు, నాయకులు వివరించారు. కారు గుర్తుకు ఓటెయ్యడం ద్వారా హైదరాబాద్‌ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్లాలని, విశ్వనగరంగా వడివడిగా అడులు వేస్తున్న హైదరాబాద్‌ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలని చైర్మన్‌ మధుమోహన్‌ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. టీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే.. మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి అండదండలతో డివిజన్‌ను అన్నివిధాల అభివృద్ధి చేస్తారని వివరించారు.

Related posts

తిరుపతిలో వారసత్వ రాజకీయాలు రాణించవా?

Satyam NEWS

కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా గోరేటి జంగయ్య

Satyam NEWS

జనసేన పార్టీలో చేరిన నిర్మాత కాయగూరల లక్ష్మీపతి

Satyam NEWS

Leave a Comment