39.2 C
Hyderabad
May 4, 2024 22: 28 PM
Slider హైదరాబాద్

ఎంఐఎం అధినేతపై జాంబాగ్‌లో ప్ర‌శ్న‌ల వ‌ర్షం..

asaduddin-owaisi

ఎంఐఎం (ఆల్ ఇండియా మ‌జ్లిస్ ఇ ఇత్తెహాదుల్ ముస్లీమీన్‌) పార్టీకి అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి జాంబాగ్ డివిజ‌న్‌లో చేదు అనుభ‌వం ఎదురైంది. కార్పొరేట‌ర్ ఎన్నిక‌ల్లో భాగంగా ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఓవైసీ జాంబాగ్‌లో ప్ర‌చారం నిర్వ‌హించేందుకు వెళ్ళారు. కాగా అక్క‌డి స్థానిక మ‌హిళ‌లు వ‌ర‌ద‌ముంపు స‌హాయంపై అసదుద్దీన్‌ను నిల‌దీశారు.

వ‌ర‌ద స‌హాయంలో మ‌ట్టి కొట్టి ఓట్ల కోసం వ‌స్తారా?

వ‌ర‌ద‌ముంపు స‌హాయం ఇస్తామంటూ ఇన్ని రోజులు తిప్పించుకోని నోట్లో మ‌ట్టికొట్టార‌ని విమ‌ర్శించారు. గ‌త ఎన్నిక‌ల్లో వ‌చ్చిన మీరు ఇప్ప‌టివ‌ర‌కూ ఇక్క‌డికి ఎందుకు రాలేక‌పోయార‌ని నిల‌దీశారు. నిరుపేద‌ల ఆక‌లిబాధ‌లు మీకు ప‌ట్ట‌వా అని ప్ర‌శ్నించారు? భారీ వ‌ర్షాల కార‌ణంగా వ‌ర‌ద ముంపులో తాముంటే అప్పుడు ప‌ట్టించుకోని మీరు ఇప్పుడు వ‌చ్చి మీ పార్టీకి ఓట్లేయ‌మంటే ఎలా న‌మ్ముతామ‌ని నిల‌దీశారు.

ఎంపీ ప‌లాయ‌నం

మ‌హిళ‌లంతా ఒకేసారి ఆయ‌న‌పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించ‌డంతో స‌మాధానం ఏం చెప్పాలో తెలియ‌క అస‌దుద్దీన్ ప‌లాయ‌నం చిత్త‌గించ‌డం కొస‌మెరుపు.

Related posts

కామవరపుకోట రోడ్డుకు తూట్లు పడ్డాయి

Bhavani

జ‌ర్న‌లిస్టుపై సామ తిరుమ‌ల‌రెడ్డి అనుచ‌రుల దాడి!

Sub Editor

బరితెగించిన వైసీపీ నాయకులు: పోలీస్ ల పై బూతు పురాణం

Satyam NEWS

Leave a Comment