41.2 C
Hyderabad
May 4, 2024 16: 45 PM
Slider గుంటూరు

జీవో నెం:1ని శాశ్వతంగా రద్దు చేయాలి

#mangalagiri

ప్రజా స్వేచ్ఛకు, రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నెంబర్:1 ని రద్దు మంగళగిరి సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏవిధమైన ర్యాలీలు, సభలు,ధర్నాలు జరగకూడదని ఒక మోసపూరితమైనటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన జీఓ నెంబర్: 1 ప్రజా స్వేచ్ఛకు గొడ్డలిపెట్టు గా మారిందని ఆయన అన్నారు.

భోగిమంటల్లో జిఓ ప్రతులను దగ్ధం చేశారు.  ప్రజా సమస్యలను ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వానికి చేరవేయడంలో ఈ విధమైన కార్యక్రమాలు ప్రజాస్వామ్యంలో భాగమని ఆయన తెలిపారు. ఈ విధమైన స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిందని, రాజ్యాంగ స్పూర్తికి తూట్లు పొడిచే విధంగా ఉన్న జీవో నెంబర్ 1 శాశ్వతంగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి జాలాది జాన్ బాబు ఏఐటీయూసీ నాయకులు చిన్ని సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Related posts

భూ సమస్యలను పరిష్కరించాలి

Murali Krishna

పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అక్రమ అరెస్టు అప్రజాస్వామికం

Satyam NEWS

తిరుమల శేషాచలం అడవుల్లో దేవాంగ పిల్లులు

Satyam NEWS

Leave a Comment