ప్రజా స్వేచ్ఛకు, రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నెంబర్:1 ని రద్దు మంగళగిరి సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏవిధమైన ర్యాలీలు, సభలు,ధర్నాలు జరగకూడదని ఒక మోసపూరితమైనటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన జీఓ నెంబర్: 1 ప్రజా స్వేచ్ఛకు గొడ్డలిపెట్టు గా మారిందని ఆయన అన్నారు.
భోగిమంటల్లో జిఓ ప్రతులను దగ్ధం చేశారు. ప్రజా సమస్యలను ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వానికి చేరవేయడంలో ఈ విధమైన కార్యక్రమాలు ప్రజాస్వామ్యంలో భాగమని ఆయన తెలిపారు. ఈ విధమైన స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిందని, రాజ్యాంగ స్పూర్తికి తూట్లు పొడిచే విధంగా ఉన్న జీవో నెంబర్ 1 శాశ్వతంగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి జాలాది జాన్ బాబు ఏఐటీయూసీ నాయకులు చిన్ని సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.