భూ సమస్యల దరఖాస్తులను నియమిత కాలంలోగా పరిష్కారానికి తహశీల్దార్లు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బల్క్ ఇష్యూల్యాండ్ సమస్యలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ ధరణికి సంబంధించి, బల్క్ ఇష్యూ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. మిస్సింగ్ ఖాతాలకు సంబంధించి దరఖాస్తులపై చర్యలు తీసుకొని, పెండింగ్ దరఖాస్తులన్ని వెంటనే పూర్తిచేసి నివేదిక సమర్పించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, జిల్లా రెవెన్యూ అధికారి శిరీష, రెవన్యూ డివిజనల్ అధికారి రవీంధ్రనాద్, కలెక్టరేట్ సూపరింటెండెంటలు సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
previous post
next post