సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం నేరేడుచర్ల మండల కేంద్రంలో 6వ విడత హరితహరం నిర్వహించారు. ఇందులో భాగంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అన్న నినాదంతో సోమవారం పట్టణంలోని పలు వార్డుల్లో మొక్కలు నాటారు. నాటిన మొక్కలను బాధ్యతగా పెంచాలని, మొక్కల అవశ్యకతను వివరిస్తూ, ఇంటింటికి మొక్కలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ చందమళ్ళ జయబాబు, వైస్ చైర్ పర్సన్ & TRS పట్టణ అధ్యక్షురాలు చల్ల శ్రీలత రెడ్డి, కమిషనర్ రాంరెడ్డి, మేనేజర్ అశోక్ రెడ్డి, ఆయా వార్డుల కౌన్సిలర్లు నాగయ్య, సాయి, సరిత, లలిత, నాగవేణి, తెరాస నాయకులు, మునిసిపల్ సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.