దేశ వ్యాప్తంగా దాదాపు రూ.75,000 కోట్ల బంగారం విక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు 15 టన్నుల బంగారం అభరణాలు అమ్ముడుపోయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత వ్యాపారాలు జోరందుకున్నాయి.
ఢిల్లీలో సుమారు రూ.1000 కోట్లు, మహారాష్ట్రలో రూ.1,500 కోట్లు, ఉత్తరప్రదేశ్లో దాదాపు రూ.600 కోట్ల అమ్మకాలు జరిగినట్లు అంచనా వేసింది సీఏఐటీ. దక్షిణ భారతదేశంలో దాదాపు రూ.2,000 కోట్ల వరకు అమ్మకాలు జరిగాయని అంచనా వేసింది.