కరోనా కారణంగా పాఠశాల కు దూరమైన విద్యార్థులు పరీక్షలు రాయడానికి మానసికంగా చాలా భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయాన్ని విడమరచి చెప్పలేని తల్లిదండ్రులకు కూడా ఏం చేయాలో అర్ధం కావడం లేదు.
ఈ విషయాన్ని ముందుగానే గమనించిన నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు ఇలాంటి విద్యార్థులపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. పదవ తరగతి తెలుగు పరీక్షకు హాజరుకాని ఇలాంటి విద్యార్థులపై ప్రత్యేక దృష్టిని నిలిపి ప్రధానోపాధ్యాయురాలు ప్రోత్సాహంతో పరీక్షకు వెళ్లిన విద్యార్థి ఆ విద్యార్థులను పరీక్షకు వెళ్ళే విధంగా చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
కొల్లాపూర్ గాంధీ ఉన్నత పాఠశాల కు చెందిన విద్యార్థి లింగస్వామి తెలుగు, హిందీ పరీక్షలకు హాజరు కాలేదు. ఈ విషయాన్ని గుర్తించిన ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. నిన్న రాత్రి 9 గంటలకు శోభారాణి లింగస్వామి తల్లిదండ్రులను కలిసి వారితో మాట్లాడారు.
తల్లిదండ్రుల వెంట చేపలు పట్టడానికి వెళుతున్న లింగస్వామికి కూడా కౌన్సిలింగ్ చేశారు. చదువుకోవటం వల్ల కలిగే లాభాల గురించి అతని తల్లిదండ్రులకు శోభారాణి వివరించారు. ఆ విద్యార్థిని పరీక్షకు వెళ్ళే విధంగా ఒప్పించి, ఈరోజు ఉదయం ఒక ఉపాధ్యాయుడిని ప్రత్యేకంగా నియమించి ఆ విద్యార్థిని పరీక్ష కు వెళ్ళే విధంగా చేశారు.
హెడ్మాస్టర్ శోభారాణితో బాటు ఉపాధ్యాయులు కురుమయ్య, శ్రీకాంత్, శీనయ్య కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలాంటి ఉపాధ్యాయుల బృందం అన్ని చోట్లా ఉంటే స్కూల్ డ్రాపౌట్స్ ఉండరు. హేట్సాఫ్ టు ఉపాధ్యాయుల బృందం.
అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్