అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణం కొత్తపేట రామాపురంలో కోడలి వసుందర(35) అక్రమ సంబందం పై ఆగ్రహం తో అత్త సుబ్బమ్మ కోడలి తల నరికి తల, కొడవలి తీసుకొని అర కిలో మీటర్ దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన సంఘటన కలకలం రేపింది.
వివరాలలోకి వెళ్తే మృతురాలు వసుందర(35) భర్త రాజా గత 11 సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈమెకు ఇద్దరు కుమార్తెలు ఉండగా, అత్త సావిత్రమ్మ తో కలిసి జీవనం సాగిస్తోంది. ఏడాది క్రితం అత్త అనారోగ్యంతో మృతి చెందగా వసుంధర అత్త సావిత్రమ్మ కు సొంత అక్క అయిన సుబ్బమ్మతో కలిసి వసుంధర జీవనం కొనసాగించేది.
ఈ క్రమంలో మృతురాలు వసుందర చిన్నమండెం కు చెందిన వందాడి మల్లి అనే వ్యక్తి తో వివాహేతర సంబంధం పెట్టుకుందనే నెపంతో గత కొద్ది కాలంగా కుటుంబీకుల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ నేపద్యంలో గురువారం ఉదయం వీరి కుటుంబీకుల మధ్య జరిగిన ఘర్షణ తారా స్థాయికి చేరింది.
అత్త సుబ్బమ్మ అన్న కుమారుడైన చంద్రబాబుతో కలసి కోడలు వసుందర తల నరికి రాయచోటి అర్భన్ పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి లొంగిపోయింది. దీనితో ఒక్కసారిగా రాయచోటి పట్టణ ప్రజలు ఉల్లిక్కి పడ్డారు.
ఈ సంఘటన పై రాయచోటి డిఎస్పీ శ్రీధర్, అర్బన్ సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్ఐలు నరసింహారెడ్డి, మహమ్మద్ రఫీ లు సంఘటనా స్థలానికి చేరుకొని వసుంధర మృతదేహాన్ని పరిశీలించి హత్యకు గల కారణాల పై ఆరా తీశారు. అనంతరం జరిగిన సంఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు డిఎస్పీ శ్రీధర్ వెల్లడించారు.