అక్టోబర్ 15వ తేదీన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో, తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బీ-ఫారాలను అభ్యర్థులకు అందచేస్తారు. పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తారు. అనంతరం అక్టోబర్ 15, 16, 17, 18 తేదీల్లో జిల్లాలు, నియోజకవర్గాల పర్యటన ప్రారంభిస్తారు. నవంబర్ 9న రెండు చోట్ల సీఎం కేసీఆర్ నామినేషన్ చేస్తారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో పాటించాల్సిన నియమ నిబంధనలు తదితర అంశాల గురించి అభ్యర్థులకు అధ్యక్షులు సీఎం కేసీఆర్ వివరిస్తారు. సూచనలు ఇస్తారు. అదే సందర్భంలో బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తారు. అనంతరం అదే రోజు (అక్టోబర్ 15)న హైదరాబాద్ నుంచి బయలుదేరి.. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ పాల్గొంటారు.
సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా