క్యాన్సర్ నిరోధక మందులపై పరిశోధన చేసిన కొల్లాపూర్ యువకుడు పీహెచ్ డి పొందాడు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం రామాపురం గ్రామానికి చెందిన పేద రైతు దాసరి మంతయ్య, శాంతమ్మ కుమారుడు దాసరి రామచందర్ యాదవ్. ఆ యువకుడు మెడిసినల్ కెమిస్ట్రీ విభాగంలో ఆంటీ క్యాన్సర్ మందులపై పరిశోధన జరిపాడు.
ఈ పరిశోధనకు CSIR JRF కూడా సాధించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం లో ప్రొపెసర్ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో చేసిన ఈ పరిశోధన కు డాక్టరేట్ వచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ డాక్టరేట్ ను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రొఫెసర్లు పరిశోధన సహచరులు పాల్గొని ఆయనను అభినందించారు. దాసరి రామచందర్ యాదవ్ కు డాక్టరేట్ రావటం పట్ల రామపూర్ గ్రామ ప్రజలు అభినందించారు. రామచందర్ కొల్లాపూర్ యూత్ ఫెడరేషన్ అధ్యక్షుడుగా సేవలు అందిస్తున్నారు.