వేసవిలో వర్షం… ఎక్కడనేగా మీ సందేహం…! విజయనగరం లో మిట్ట మధ్యాహ్నం… మాడు పగిలే ఎండకాలంలో… వర్షం ఏంటని ఆశ్చర్య పోకండి.. ఇలా సందేహ పడతారనే “సత్యం న్యూస్. నెట్” ప్రత్యక్షంగా విజువల్స్ తో పాటు ..పడిన వర్షం దృశ్యాలను తీసింది. అయితే ఈ నెల 16వ తేదీన.. ఐఎండీ…మూడు రోజుల పాటు వాతావరణం మారులు వస్తాయని చెప్పింది… కూడా.దరిమిలా.. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం 18వ తేదీన మండే ఎండ కు బదులు.. ఆకాశం మేఘావృతమై… చిన్న చిన్న గా చినుకులు మొదలయ్యాయి. దీనికి తోడు ఉరుములతో విజయనగరం లో వర్షం పడింది. అయితే… మిట్ట మధ్యాహ్నం. మాడు పగిలే ఎండకు బదులు… వాతావరణం చల్లబడి…చినుకులు పడటంతో విజయనగరం ప్రజలు…”వేసవిలో వర్షమా..” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేయడం విశేషం.
previous post
next post