కర్నూలు జిల్లాకు చెందిన, హైకోర్టు న్యాయవాది ఆవుల వెంకటేశ్వర్లును ఎవరో దారుణంగా హత్య చేశారు. కర్నూలు నగర శివారులోని సఫా ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర వెంకటేశ్వర్లు మృత దేహాన్ని పోలీసులు గుర్తించడం తో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
హత్య చేసి రోడ్డు పక్కన పారేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఆవుల వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యుల సమాచారం మేరకు ఈ నెల 7 వ తేది నుంచి ఆయన కనిపించడంలేదు. అదృశ్యమైన వెంకటేశ్వర్లు మృతదేహం నేడు కనిపించింది. చింతకుంటలో తమ్ముని వద్దకు వెళ్లి తిరిగివస్తూ ఆయన కనిపించకుండా పోయారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మహానంది పీఎస్ లో మిస్సింగ్ కేసు నమోదు అయింది. మృతుడు వెంకటేశ్వర్లు కర్నూలు నగరంలోని టెలికం నగర్ లో నివాసం ఉంటున్నారు.
రియల్ ఎస్టేట్ వివాదాల్లో వకాలత్ తీసుకొని కోర్టులో ఆయన వాదిస్తున్నారు. భూ వివాదం క్రమంలోనే.. ఆయనను హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వీటిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.