“హిందువుగా జీవించు…హిందువని గర్వపడు..హిందువుగా మరణించు”…ఇలా ప్రతి హిందువు ఆలోచనలు చేయాలని కోరుతూ విజయనగరం అయోధ్య మైదానంలో ఈ నెల 20 వ తేదీన హైందవ శంఖారావం తలపెట్టింది… హిందూ ధర్మరక్షా సమితి. ఈ విషయం తో పాటు ఆ రోజు చేపడుతున్న కార్యక్రమ స్వరూపాన్ని మీడియా సమావేశంలో తెలిపారు…
నిర్వాహకులు. ఈ సమావేశం లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందివాడ వేణు గోపాల్ కార్యదర్శి ఆబోతుల శ్యామ్ సుందర్ జిల్లా అధ్యక్షులు రాయపాటి రామరాజు శఠగోపం పార్థసారధి రామ్ తరుణ్ తదితరులు మాట్లాడుతూ హిందువుల ఐక్యతా సాధన ద్యేయం గా ఈ నెల 20 వ తేదీ ఆదివారం అయోధ్య మైదానం లో హైదవ శంఖారావం పేరిట భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఉదయం అఖండ హోమం సాయంత్రం శోభాయాత్ర ర్యాలీ అనంతరం ప్రముఖ ఆధ్యాత్మిక గురువులైన రాధా మనోహర్ దాస్. భారతీయం సత్యవాణి సురేశ్వరానంద యోగి మహారాజ్ శ్రీ యోగి అతిధేశ్వరానంద పర్వత తదితరుల ఆధ్యాత్మిక ప్రసంగాలు ఉంటాయి అని తెలిపారు ఈ కార్యక్రమం లో రాష్ట్ర అధ్యక్షులు చేదులూరి గురువయ్య మరియు కెల్లా దుర్గారావు ఆద్వర్యం లో మాలాధారులైన భక్తులకు అఖండ హారతి మరియు ఆకు పూజ జరుగుతుందని తెలిపారు .ఈ కార్యక్రమానికి హిందువులు సుమారు 30 వేల మంది వరకు హాజరు అవుతారు అని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమం లో ముత్యాల నాయుడు కళ్యాణ్ కుమార్ రామ్ రాజేష్ శివ కుమార్ గౌరీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు