మత మార్పిడికి సంబంధించి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మధ్యప్రదేశ్ మత స్వేచ్ఛా చట్టం 2021లోని సెక్షన్ 10 రాజ్యాంగ విరుద్ధమని జబల్పూర్ హైకోర్టు పేర్కొంది. సెక్షన్ 10 ప్రకారం ఏ వ్యక్తి అయినా మతం మారాలంటే కనీసం 60 రోజుల ముందు జిల్లా మేజిస్ట్రేట్ ఎదుట ఒక అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. తన ఇష్టాను సారమే మతం మారుతున్నానని, తనపై ఎవరి వత్తిడి లేదని ఆ అఫిడవిట్ లో పేర్కొనాల్సి ఉంది. అయితే ఈ క్లాజు వ్యక్తి స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తున్నదని జబల్పూర్ హైకోర్టు నేడు వెల్లడించింది.
ఇద్దరు వయోజనులు తమ ఇష్టానుసారం వేరే కులం లేదా మతంలో వివాహం చేసుకుంటే, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ, మధ్యప్రదేశ్ మత స్వేచ్ఛా చట్టం 2021లోని సెక్షన్ 10 రాజ్యాంగ విరుద్ధమని జబల్పూర్ హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లోగా ప్రభుత్వం సమాధానం చెప్పాలని అందులో ఆదేశించింది. మత స్వేచ్ఛ చట్టంలోని సెక్షన్ 10ని ఉల్లంఘించే ఏ వ్యక్తిపైనైనా చర్యలు తీసుకోకుండా జబల్పూర్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలువరించింది.
మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ, మధ్యప్రదేశ్ మత స్వేచ్ఛా చట్టం 2021లోని సెక్షన్ 10 రాజ్యాంగ విరుద్ధమని జబల్పూర్ హైకోర్టు పేర్కొంది. ఈ సెక్షన్ ప్రకారం, ఇతర మతంలో వివాహం చేసుకున్న వారికి వివాహానికి 60 రోజుల ముందు జిల్లా మేజిస్ట్రేట్ అంటే కలెక్టర్కు సమాచారం ఇవ్వడం తప్పనిసరి చేయబడింది. అలా చేయని పక్షంలో 2 సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుంది.
మధ్యప్రదేశ్ మత స్వేచ్ఛ చట్టం 2021లోని సెక్షన్ 10కి వ్యతిరేకంగా జబల్పూర్ హైకోర్టులో 6 పిటిషన్లు దాఖలు చేయడం ద్వారా ఈ చట్టం చట్టబద్ధత సవాలు చేశారు. ఈ చట్టంలోని సెక్షన్ 10 జిల్లా మేజిస్ట్రేట్కు ఏకపక్ష అధికారాలను కల్పిస్తున్నదని, ఇది రాజ్యాంగం ఇచ్చిన మతస్వేచ్ఛకు విరుద్ధమని పిటిషన్లలో పేర్కొన్నారు. విచారణ అనంతరం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ మైనారిటీ తీరిన వారు తమ ఇష్టానుసారం ఏదైనా ఇతర కులం లేదా మతంలో వివాహం చేసుకుంటే, వారిపై కేసు నమోదు చేయరాదని పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారంపై 3 వారాల్లోగా వివరణ ఇవ్వాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది.