ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పిఆర్సి ని హోంగార్డు లకు వర్తింపజేస్తూ అసెంబ్లీలో ప్రకటించినందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చిత్రపటానికి ఈరోజు ఖమ్మం జిల్లా హోంగార్డ్స్ ఆఫీసర్స్ సంక్షేమ సంఘం కార్యాలయంలో పాలాభిషేకం చేశారు.
అడిషనల్ డిసిపి అడ్మిన్ పూజ కు, అడిషనల్ డిసిపి లా అండ్ ఆర్డర్ మురళీధర్ కు, ఏ సి పి ఎఆర్ విజయ్ బాబు కు, ఏఆర్ అడ్మిన్ ఆర్ ఐ రవికి, హోంగార్డ్ ఆర్ఐ తిరుపతికి, ఆఫీస్ సిబ్బంది కి హోంగార్డ్స్ స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా హోంగార్డు ఆఫీసర్స్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు టి సుధాకర్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ రఫీ కార్యదర్శి బంక శీను, నీరజ, విజయ్ , నగర ఉపాధ్యక్షుడు నూనె నాగేశ్వరరావు, గౌరవ సలహాదారుడు ఈ వెంకటేశ్వర్లు, సాదిక్ వెంకన్న రమేష్ యూసుఫ్ నాగరత్నం కొండలరావు మొదలగు హోంగార్డు లందరూ పాల్గొన్నారు.