ములుగు ఏ ఎస్ పి కార్యాలయ ఆవరణలో ములుగు పోలీస్ స్టేషన్ సిబ్బందికి శిరస్త్రాణాలను తిరుమల టీవీఎస్ షోరూం యజమాని గున్నాల తిరుమల్ రెడ్డి సౌజన్యంతో ములుగు ఏ ఎస్ పి సాయి చైతన్య పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎఎస్పీ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది తప్పకుండా రోడ్డు నియమనిబంధనలు పాటించి ప్రజలకు ఆదర్శంగా నిలవాలన్నారు. హెల్మెట్ లేకుండా పోలీస్ స్టేషన్ ఆవరణలోకి వచ్చినట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హెల్మెట్ పంపిణీ చేసిన టీవీఎస్ షోరూం యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఎస్పీ చెన్నూరి రూపేష్, ములుగు ఎస్సై హరికృష్ణ, పోలీస్ సిబ్బంది టీవీఎస్ షోరూం యజమాని తిరుమల్ రెడ్డి, రాకేష్ సిబ్బంది పాల్గొన్నారు.