పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో దారుణం జరిగింది. అనుమానంతో ఒక భర్త తన భార్యను చంపేశాడు. 40 సంవత్సరాల కామిశెట్టి సుబ్బలక్ష్మి కొద్ది రోజులు దుబాయ్ లో ఉండి వచ్చింది. అప్పులు తీర్చేందుకు ఆమె మూడు సంవత్సరాల కిందట దుబాయ్ వెళ్లింది. కొద్ది రోజుల క్రితం సెలవుపై తాడేపల్లిగూడెం వచ్చింది. స్థానిక భాగ్యలక్ష్మి పేట లో నివసిస్తున్న ఆమె హత్యకు గురికావడం సంచలనం కలిగించింది. భార్య పై అనుమానంతో భర్త కామిశెట్టి దేవరాజు అలియాస్ విగ్ రాజు చాకుతో పొడిచి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. అనుమానంతో పధకం ప్రకారం పొట్టలో, ఛాతీలో, ఇతర శరీర బాగాలపై విచక్షణా రహితంగా దాడి చాకుతో అతను దాడి చేశాడని పోలీసులు వెల్లడించారు. సుబ్బలక్ష్మి దుబాయిలో ఉన్న వ్యక్తితో ఫోన్ మాట్లాడుతుందన్న అనుమానంతో జరుగుతున్న గొడవల నేపథ్యంలో ఆమెను భర్త పొడిచాడని అనుమానిస్తున్నారు.
previous post