తాను విజయనగరంలో భూములు ఆక్రమించానని ఆధారాలతో రుజువు చేస్తే నామినేషన్ వేయనని డిప్యూటీ స్పీకర్, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి సవాల్ చేశారు. విజయనగరం పూల్ భాగ్ లో ఉభయ జిల్లాల వైఎస్సార్సీపీ నేతల విస్ర్తత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ…. భూములను ఆక్రమించుకున్నాని టీడీపీ అర్ధరహిత ఆరోపణలను అని కోలగట్ల అన్నారు. ఇక నామినేషన్ కు ఇంకా సమయం ఉఃదని… ఈ లోపున నేను భూములను ఆక్రమించానని రుజువు చేస్తే… ఆ నామినేషన్ విరమించుకుంటానని కోలగట్ల అన్నారు. నాపై ఎలాంటి ఆరోపణలు లేకపోయిబట్టే ఉత్తరాంధ్రలో అత్యధిక శాతం ఉన్న బీసిలలో ఓసి అయిన నాకు జగన్ అసెంబ్లీ సీట్ ఇచ్చారని కోలగట్ల స్పష్టం చేశారు
previous post