నూతన ఓటరు నమోదు, ఓటరు జాబితా సవరణలపై వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి స్పష్టమైన జాబితా రూపొందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఎస్ ఎస్ ఆర్ 2023 లో భాగంగా నూతన ఓటరు నమోదు, ఓటరు జాబితా సవరణలపై వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి స్పష్టమైన జాబితా రూపొందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు.
హైదరాబాద్ నుండి అదనపు ఎన్నికల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో ఓటరు జాబితా రూపకల్పన పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ, ఎలాంటి పొరపాట్లు లేని స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించేలా జిల్లా ఎన్నికల అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని తెలిపారు.