41.2 C
Hyderabad
May 4, 2024 17: 11 PM
Slider ఖమ్మం

ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వను

#BRS candidate touch

కొత్తగూడెంలో 2014లో ఒక సీటు గెలిచారు.. 2018లో ఖమ్మంలో ఒక సీటును గెలిచారు.. 2023లో ఉమ్మడి జిల్లానుంచి ఒక్కరంటే ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వనని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పొంగులేటిని, జూపల్లిని పార్టీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ఎన్నో విషయాల్లో కేసీఆర్, కేటీఆర్ మాటలు నమ్మి మోసపోయానని.. పార్టీలో చేరిన చాలా కాలం తర్వాత వీరి గురించి తెలిసి జ్ఞానోదయం అయిందనన్నారు. ఎన్నో విషయాలల్లో తనను వాడుకొని నమ్మక ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. పొంగులేటి పార్టీలోనే లేనన్నారని.. పార్టీలో లేని వ్యక్తిని ఇప్పుడు ఎట్లా సస్పెండ్ చేస్తారని ధ్వజమెత్తారు.


భవిష్యత్తులో తనలాంటి అసంతృప్త నేతలను ఏకం చేసి తానేంటో చూపిస్తానన్నారు. మొత్తానికి రావణాసురుడి కబంధ హస్తాలనుంచి ఇన్నాళ్లకు విముక్తి కలిగి భద్రాద్రి శ్రీరాముడి పాదాలను తాకే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. తాను ఎప్పుడు ప్రజల క్షేత్రంలోనే ఉంటానని.. ఇకపై కూడా ప్రజల్లోనే తేల్చుకుంటాన్నారు.
గత ఎన్నికల్లో తనకు ఎంపీ టికెట్ ఇవ్వకుండా ఓ అభ్యర్థికి ఇచ్చి తననే గెలిపించాలని చెప్పినా పార్టీ కోసం గెలిపించానని, ఆ తర్వాత రాజ్యసభ సీటు కూడా ఇవ్వకుండా అవమాన పరిచారన్నారు.

నాతో పాటు ఎంతోమంది నాయకులను తడి గుడ్డతో గొంతు కోయాలని చూశారని ధ్వజమెత్తారు. 2018లో ఎన్నికల తర్వాత వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం గెలుపుకోసం ఎంతో కృషిచేశానన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా తన మనుషులకు ఒక్క సీటు సైతం ఇవ్వలేదన్నారు. గత సింగరేణి ఎన్నికల్లో తాను ఎంతో కృషి చేసి గెలిపించిన విషయం వాస్తవం కాదా అన్ని సీఎంను ప్రశ్నించారు. ఎన్నికల్లో పార్టీ కోసం పనికొచ్చిన శ్రీనివాసరెడ్డి ఇప్పుడు పనికి రాకుండా పోయాడా అని మండిపడ్డారు.

మీరు చెప్పిన మాటలన్నీ మేడిపండు మాటలని ఆనాడు గ్రహించలేక పోయానని… ఎంతో మంది మేధావులు, యోధానుయోధులు వల్లే తెలంగాణ సిద్ధించిందని.. వారందరినీ మీరు అవమానించింది వాస్తవం కాదా అన్నారు.
నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్న తనను, తనను నమ్మకున్న వేలాది మందిని ఎన్నోసార్లు ఇబ్బందులకు గురిచేశారని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, చివరికి నా కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేసినా తాను నమ్మిన సిద్ధాంతాన్ని వదలనన్నారు.


పాలేరులో బీఆర్ఎస్ పార్టీతో మొదలైన తన ప్రస్థానం కొత్తగూడెం శీనన్న అభిమానుల ఆత్మీయ సమ్మేళనంతో ముగిసిన వెంటనే సస్పెండ్ చేస్తూ ప్రకటన చేయడం జరిగిందన్నారు. పార్టీకి 2018 ఏప్రిల్ నెలలో రమ్మన్నది వారేనని.. సరిగ్గా ఏడేళ్ల తరువాత అదే ఏప్రిల్ నెలలో పార్టీ నుంచి పొమ్మంటున్నదీ వారే అన్నారు. పార్టీలో పొంగులేటికి సభ్యత్వమే లేదన్నారని, అసలు సస్పెన్షన్లే బీఆర్ఎస్ లో ఉండవని అన్న పార్టీ పెద్దలు తనను సస్పెండ్ చేస్తూ ప్రకటన చేయడం విడ్డూరమన్నారు.

మూడున్నర నెలలుగా బీఆర్ఎస్ పై తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్నా.. ఇప్పుడు సస్పెండ్ చేయడం హాస్యస్పాదమన్నారు. ఉమ్మడి జిల్లాలోనే కాదు రాష్ట్ర రాజకీయాలనే మలుపుతిప్పే ప్రయత్నం చేస్తానని… సమయం ఆసన్నమైందని, అన్నిజిల్లాల్లో తనలాగా బాధపడే అందరినీ కలిసి వారితోనే నిర్ణయం తీసుకుంటానన్నారు. అతికొద్ది రోజుల్లోనే జెండా, ఎజెండా. ప్రకటించబోతున్నాను సిద్ధంగా ఉండండంటూ ఈ సందర్భంగా పొంగులేటి చెప్పారు.

Related posts

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం పి ఆర్ టి యు టి ఎస్ తోనే సాధ్యం

Satyam NEWS

మారని ప్రైవేట్ ఆసుపత్రుల తీరు.. రోగుల నుంచి అధిక ఫీజుల వసూలు

Satyam NEWS

సంకట హర గణేశం భజే!

Satyam NEWS

Leave a Comment