35.2 C
Hyderabad
April 27, 2024 12: 50 PM
Slider ఆదిలాబాద్

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం పి ఆర్ టి యు టి ఎస్ తోనే సాధ్యం

#PRTU

PRTU  ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని చాంద,యాపలగూడ, బంగారిగూడ, రామాయ కొత్తగూడ తదితర పాఠశాలలో 2021 సంవత్సరపు  సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కార్యక్రమంలో  ఆదిలాబాద్ జిల్లా  అధ్యక్షులు కొమ్ము కృష్ణ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కుడాల రవీందర్   ఆదిలాబాద్ గ్రామీణ మండల  అధ్యక్షులు ఆరె భాస్కర్ ప్రధాన కార్యదర్శి  దాసరి వెంకటరమణ,  రాష్ట్ర, మండల  బాధ్యులు గౌర ఈశ్వర్,   చిలుక పోచన్న.  మధుకర్ వర్మ పాల్గొనడం జరిగింది.

ఈ సందర్భంగా కొమ్ము కృష్ణ కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సంక్షేమం కోసం PRTU సంఘం ఎల్లప్పుడు కృషి చేస్తూ నే ఉంటుంది. PRC ఫిట్మెంట్ 30%. కేజీబీవీ ఉపాధ్యాయులకు 180 రోజులు మెటర్నటీ సెలవులు సిపిఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ ఇప్పించిన ఘనత పిఆర్టియు సంఘానిదే.  టిఆర్టి 2017 ఉపాధ్యాయులకు 30 శాతం పిట్మెంట్ వచ్చేలా సంఘం కృషి చేస్తుంది. 

త్వరలో ఉపాధ్యాయుల బదిలీ, ప్రమోషన్లు  జరుగుతాయి.  CPS పెన్షన్ రద్దుచేసి పాతపెన్షన్ (GPF) లోనికి తీసుకొస్తామన్నారు.2003 DSC ఉపాధ్యాయులకు కూడా పాత పెన్షన్ జీవో తీసుకొస్తామని తెలియజేసినారు త్వరలో PRTU సంఘం 50 వసంతాల స్వర్ణోత్సవం జరుపుకుందామని మన సమస్యలన్నిటినీ పరిష్కరించుటకు కృషి చేస్తామని సంఘాన్ని బలపరిచి అందరు ఉపాధ్యాయులు సంఘ సభ్యత్వాన్ని స్వీకరించాలని కోరినారు.

Related posts

వి యస్ యూ లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

Satyam NEWS

కొత్త జిల్లాల్లో.. ఇక జిల్లా జడ్జీ కోర్టులు

Satyam NEWS

విద్యతోనే ఉన్నత లక్ష్యాలు చేరుకోవచ్చు

Bhavani

Leave a Comment