Slider కడప

మత సామరస్యాన్ని ప్రతీక రంజాన్: మేడా బాబు

#iftar

రంజాన్ మత సామరస్యానికి ప్రతీక అని యువ నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డి (బాబు) అన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట లో గురువారం రాత్రి వజ్రం కల్యాణ మండపంలో యువనాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం మైనా రిటీలకు రంజాన్ ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలకు రంజాన్ తోపా ఇవ్వడం సంతోషంగా ఉందని,భవిష్యత్ లో ముస్లిం మైనారిటీలకు తాను వారికి ఏ అవసరం వచ్చినా అండగా ఉంటానని, తనకి వారి ఆశీస్సులు కావాలని కోరారు. ఈ కార్య క్రమంలో ముస్లిం మైనారిటీలు పెద్ద సంఖ్యలో పాల్గొ న్నారు. ముస్లింలకు నమాజ్ అనంతరం భారీగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం మైనారిటీలు మేడా విజయ శేఖర్ రెడ్డి కి శాలువా, బొకేతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గండికోట గుల్జార్ బాషా,మిరియాల సురేఖ,చిట్టే భాస్కర్, శివయ్య,మధు,హరీష్,అఖిల్,జానీ,ఫరూక్,రెడ్డి,జడ శివా తదితరులు పాల్గొన్నారు.

Related posts

కాంగ్రెస్ పార్టీ సునామీలో బిఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోతుంది

Satyam NEWS

బాబు విడుదలతో మిన్నంటిన సంబరాలు

Satyam NEWS

శివోహం: తెలుగు రాష్ట్రాల్లో కిక్కిరిసిన ముక్కంటి ఆలయాలు

Satyam NEWS

Leave a Comment