హుజూర్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మాజీ పిసిసీ అధ్యక్షుడు కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గురువారం తన నామినేషన్ దాఖలు చేశారు.
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ లో నామినేషన్ వేసిన అనంతరం కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 50వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో తానును ప్రజలు గెలిపిస్తారని అన్నారు.హుజూర్ నగర్ నియోజకవర్గం ప్రగతి పథంలో నడిపిస్తానని,హుజూర్ నగర్ ప్రజలకు కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాల వారికి సహాయం చేస్తామని అన్నారు.గత నాలుగు ఏళ్ళుగా హుజూర్ నగర్ పట్టణంలో దోపిడి వ్యవస్థ, దౌర్జన్యం,అక్రమార్జనకు గురైందని అన్నారు.తనకు పిల్లలు లేరని, హుజూర్నగర్ ప్రాంత ప్రజలే తనకు బిడ్డలతో సమానమని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తనకు పిల్లలు లేరు.ఈ ప్రాంత ప్రజలనే నా పిల్లలుగా భావించి పనిచేశానని తెలిపారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సునామీ ప్రభంజనం వీస్తుందని,ఈ సునామీలో బిఆర్ఎస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుందని అన్నారు.టిఆర్ఎస్ పాలన, కెసిఆర్ పై తీవ్ర విమర్శలు కురిపించారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్