టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ వన్డే ఫార్మాట్లో కెప్టెన్గా కొనసాగాలని భావించాడు. కానీ, బీసీసీఐ, సెలెక్టర్లు కోహ్లీ నిర్ణయాన్ని లెక్కలోకి తీసుకోలేదు. వైట్ బాల్ క్రికెట్లో ఒకే ఒక్క కెప్టెన్ ఉండాలని వారంతా కోరుకున్నారు. దీంతో బీసీసీఐ రోహిత్ శర్మకు సారథ్య బాధ్యతలు అప్పగించింది. అయితే విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ నుంచి తప్పుకుంటాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
ది టెలిగ్రాఫ్లో ప్రచురించిన నివేదిక ప్రకారం, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ నుంచి విరాట్ కోహ్లీ తన పేరును ఉపసంహరించుకోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భారత్, దక్షిణాఫ్రికా మధ్య మూడు టెస్టుల సిరీస్ తర్వాత, జనవరి 19 నుంచి మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్కు ఫుల్ టైం కెప్టెన్గా రోహిత్ శర్మ తన మొదటి వన్డే సిరీస్ ఆడనున్నాడు. విరాట్ కోహ్లి ఆడతాడా లేదా అనేది ఇంకా పూర్తిగా తెలియలేదు.
అయితే బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ ఓ వివరణ ఇచ్చాడు. టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లి తప్పుకోవడం బీసీసీఐకి ఇష్టం లేదని, అయితే అతను బోర్డు చెప్పినా వినలేదని గంగూలీ పేర్కొన్నాడు. ఈమేరకు కోహ్లీకి 48 గంటల గడువు ఇచ్చినా, ఎలాంటి సమాధానం లేకపోవడంతో బీసీసీఐ పెద్దలు కోహ్లీని తప్పించారు.