39.2 C
Hyderabad
May 4, 2024 20: 08 PM
Slider రంగారెడ్డి

బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం రోజు కుమ్ములాటలు

#talakondapalli

బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం రోజునే సొంత పార్టీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే అనుచరులు ఒకరిని మరొకరు తోసుకున్నారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలో దాదాపు 40 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించడానికి వచ్చిన ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, గోరేటి వెంకన్న ను  కల్వకుర్తి ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ అనుచరులు  అడ్డుకుంటూ ఎమ్మెల్సీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తలకొండపల్లిలో చాలాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంరోజే సంఘటన చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కల్వకుర్తి టిఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో అనేక విభేదాలు ఉన్నాయని మరోసారి బట్ట బయలు అయ్యింది.

Related posts

వెంకటగిరి వైసీపీలో వర్గపోరు

Satyam NEWS

కృష్ణా జిల్లాలో 15 థియేటర్లు సీజ్ చేసిన అధికారులు

Satyam NEWS

అమరావతే రాజధాని అని బి.జె.పి. స్పష్టంగా చెప్పింది

Satyam NEWS

Leave a Comment