బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం రోజునే సొంత పార్టీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే అనుచరులు ఒకరిని మరొకరు తోసుకున్నారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలో దాదాపు 40 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించడానికి వచ్చిన ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, గోరేటి వెంకన్న ను కల్వకుర్తి ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ అనుచరులు అడ్డుకుంటూ ఎమ్మెల్సీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తలకొండపల్లిలో చాలాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంరోజే సంఘటన చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కల్వకుర్తి టిఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో అనేక విభేదాలు ఉన్నాయని మరోసారి బట్ట బయలు అయ్యింది.