సినిమా హాళ్లపై ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తున్న జగన్ ప్రభుత్వం ఏం జరిగినా ఆగడం లేదు. వివిధ కారణాలతో కృష్ణా జిల్లాలో 15 థియేటర్లు సీజ్ చేశారు. లైసెన్సు లేకుండా నడుస్తున్న 15 థియేటర్ల మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని థియేటర్లలో తనిఖీలు నిర్వహించారు. టిక్కెట్ రేట్లు, ఫైర్ సేఫ్టీ, కోవిడ్ ప్రోటోకాల్ తదితర అంశాలపై తనిఖీలు నిర్వహించారు. ప్రేక్షకుల భద్రత కోసం నిబంధనలు సరిగా ఉన్నాయో లేదో చెక్ చేశారు. టిక్కెట్ రేట్ల కంటే తినుబండారాలు రేట్లు చాలా ఎక్కువగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇకపై మల్టీప్లెక్స్ లతో పాటు అన్ని థియేటర్లకు ఫిక్స్డ్ రేట్లు వర్తిస్తాయని అధికారులు చెబుతున్నారు. జీవో 35 కోర్టులో కొట్టేయడంతో అంతకు ముందు రేట్లు అమలుపై అధికారుల దృష్టి పెడుతున్నారు. సినిమా హాల్ కు సంబంధించిన పారం బి ను తనిఖీ చేస్తున్నారు.