నకిరేకల్ నియోజకవర్గ ప్రజల కలల ప్రాజెక్ట్ లు ధర్మారెడ్డిపల్లి, పిలాయిపల్లి కాలువల పనులలో అలసత్వం వహించరాదని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం నాడు నల్లగొండ జిల్లా రామన్నపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ప్రస్తుతం జరుగుతున్న పనులపై ఆరా తీశారు. ఎక్కడెక్కడ సమస్యలున్నాయో గుర్తించి వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాంట్రాక్టర్లతో ఎప్పటికప్పుడు సమావేశం నిర్వహించి పనులలో వేగం పెంచాలన్నారు.
ఇబ్బంది ఉన్న చోట ప్రత్యేక చొరవ తీసుకొని రైతులను ఒప్పించాలని అన్నారు. అవసరమైతే రైతులతో తానే నేరుగా మాట్లాడుతానని తెలిపారు. గతంలో నా సొంత డబ్బులతో పనులు చేయించామని గుర్తు చేశారు. రెండు నెలల పాటు రాత్రింబవళ్లు పనులను దగ్గరుండి పర్యవేక్షించామని అన్నారు.
భూ సేకరణ విషయంలో జరుగుతున్న జాప్యం పై రేపే కలెక్టర్ తో సమావేశం నిర్వహిస్తామని అన్నారు.. ఈ సమీక్ష సమావేశంలో ఎస్ సి ఆనంద్, ఈ ఈ మనోహర్, డీ ఈ కృష్ణా రెడ్డి, ఏ ఈ లు చంద్రశేఖర్, ప్రవీణ్ లు,స్థానిక ఎంపిపి జ్యోతి, తదితర నాయకులు పాల్గొన్నారు.