భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ , హబ్సిగూడ డివిజన్ కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరిష్ లు ఓయూ ఉప కులపతి రవీందర్ యాదవ్ ని ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా ఓయూ క్యాంపస్ లోని ప్రజల సమస్యలు పరిష్కరించాలాని ఓయూ ఉప కులపతి రవీందర్ యాదవ్ కి ప్రజల సమస్యలు శ్మశాన వాటిక చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణ పనుల చేయడానికి అనుమతించాలని, క్యాంపు లోని ప్రజలుకు మంచినీటి ట్యాంకర్లు రావడానికి అంబులెన్స్ రావాడానికి ఇబ్బంది కలుగకుండా రోడ్డు వేయాలని, మురుగుకాలవ పనులు మరమ్మతులు చెసుకునేలా అవకాశం ఇవ్వాలని, రవీంద్రనగర్ కాలనీ వద్ద గత వర్షాల వల్ల గోడ కూలిపోవడం జరిగింది దాన్ని మల్లి నిర్మించాలని వివరించారు. సానుకూలంగా స్పందించిన విసి అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బస్తిల ప్రజలు శంకర్, సుధాకర్, ఖలీద్, యూసఫ్, బిజెపి నాయకులు సంజయ్ పటేల్, అల్కాపురి సురేష్, తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి