ఐసోలేషన్ సెంటర్లో ఉన్న కరోనా పాజిటివ్ పేషేంట్లకు, డ్యూటీలో ఉన్న వైద్య సిబ్బందికి మై వేములవాడ వాట్సాప్ గ్రూపు సేవలు అందిస్తున్నది.
ఈ సేవలలో భాగంగా అల్పాహారం, మధ్యాహ్న భోజనం సమకూరుస్తున్నారు. సిరిసిల్ల జిల్లా వేములవాడలో గత నాలుగు రోజులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
నాలుగవరోజు కార్యక్రమంలో భాగంగా వేములవాడ లక్ష్మిగణపతి కాంప్లెక్స్ లో ఉన్న ఐసోలేషన్ సెంటర్లో కరోనా పాజిటివ్ పేషేంట్లకు, డ్యూటీలో ఉన్న వైద్య సిబ్బందికి ఈరోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం సమకూర్చారు.
అలాగే రాత్రికి కూడా భోజనం సమకూర్చనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా లాక్డౌన్ పూర్తి అయ్యే వరకూ ప్రతీరోజు అల్పాహారం, భోజనం అందించనున్నట్లు గ్రూపు సభ్యులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కుమ్మరి శంకర్, మధు మహేష్, డాక్టర్ రవీందర్, ఓడ్యాల వేణు, నూగురి మహేష్ , రంగుల శ్రీనివాస్ మరియూ సంకెపెల్లి పవన్ కుమార్ పాల్గొన్నారు.