34.7 C
Hyderabad
May 5, 2024 02: 46 AM
Slider హైదరాబాద్

సోమసుందర్ నగర్ పార్కు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కాలేరు

#Kaleru MLA

బాగ్ అంబర్ పేట డివిజన్ లోని సోమసుందర్ నగర్ పార్కులో అభివృద్ధి మరియు సుందరీకరణ పనులు సుమారు 50% పూర్తి అయిన నేపథ్యంలో, ఈరోజు అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పార్కును సందర్శించి, పనుల పురోగతిని స్వయంగా పరిశీలించి చేపట్టాల్సిన ఇతర పనుల గురించి అధికారులకు తగు సూచనలు చేశారు.

పెండింగులో పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, బాగ్ అంబర్ పేట డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చంద్రమోహన్, నాయకులు కంచే మహేష్, మిర్యాల రవీందర్, రమేష్ నాయక్, శివమూర్తి, సుధాకర్, యోబు, కాలనీ ప్రెసిడెంట్ చంద్రశేఖర్, కాలనీ మహిళా నాయకురాలు రాజేశ్వరి, పలువురు కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట్

Related posts

హరీషన్నకు అవమానం చేసిన టిటిడి అధికారులు

Satyam NEWS

రూ.15 కోట్లతో మల్టీ యుటిలిటీ సెంటర్‌ నిర్మాణానికి అవగాహనా ఒప్పందం

Bhavani

సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు

Satyam NEWS

Leave a Comment