అంబర్ పేట వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ పై సర్వహక్కులు తమకే ఉన్నాయని, అసలు అసోసియేషన్ తమదేనని సీనియర్ జర్నలిస్టులు స్పష్టం చేశారు. సోమవారం అంబర్ పేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంబర్ పేట వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీష్ ముదిరాజ్, ఉపాధ్యక్షుడు బివి శేఖర్, కోశాధికారి సయ్యద్ గౌస్ పాషాలు మాట్లాడుతూ కొందరు తమ అసోసియేషన్ నకిలీ దంటూ వాట్సప్ గ్రూపుల్లో పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు.
అసలు అసోసియేషన్ ఎవరిదో, నకిలీ అసోసియేషన్ ఎవరిదో అంబర్ పేటకు చెందిన ప్రజాప్రతినిధులకు, ప్రజలకు తెలుసునని వారు పేర్కొన్నారు. 32 ఏళ్ల నుంచి తాము హైదరాబాద్ లో జర్నలిస్టుగా పని చేస్తున్నామని వారు తెలిపారు. ఆ సమయంలో ఎక్కడో మారుమూల గ్రామాల్లో చదువుకుంటూ, పనులు చేసుకుంటూ నిన్న మొన్న జర్నలిస్ట్ వృత్తిలోకి వచ్చిన కొందరు సీనియర్లమైన తమను నకిలీ అంటున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఎవరో నకిలీ ఎవరో గౌరవ కోర్టు తేల్చుతుందని పేర్కొన్నారు.
అదేవిధంగా అంబర్ పేట నియోజకవర్గంలో పనిచేస్తున్న కొంతమంది న్యూస్ కంట్రిబ్యూటర్ల అక్రమ ఆస్తులపై ప్రభుత్వం విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. వివిధ పత్రికలు పనిచేస్తూ న్యూస్ కంట్రీబుటర్లుగా విధులు నిర్వహిస్తూ వారు లక్షలాది రూపాయల విలువైన ఇండ్లు, భవనాలు ఎలా కొనుగోలు చేశారో విచారణ ద్వారా బయట పెట్టాలని వారు విజ్ఞప్తి చేశారు.
సత్యం న్యూస్, అంబర్పేట్