కామారెడ్డి నియోజక వర్గంలోని పలు మండలాలకు చెందిన 328 మందికి 3 కోట్ల 28 లక్షల రూపాయల కళ్యాణలక్ష్మి చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎం కే ముజీబుద్దిన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజక వర్గంలో 6,253 మందికి 62 కోట్ల 20 లక్షల 93 వేల రూపాయల కల్యాణలక్ష్మి, షాది ముభారక్ చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఆడపిల్ల పుడితే బాధపడే రోజులు పోయాయని, ఆడపిల్లను మగ పిల్లవానితో సమానంగా పెంచాలని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆడపిల్లల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు.
జి.లాలయ్య సత్యం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం