కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. కరీంనగర్లోని మూడు డివిజన్ల రిజర్వేషన్లపై గతంలో సింగిల్ జడ్జి అభ్యంతరం తెలిపారు. సింగిల్ జడ్జి తీర్పును రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనం వద్ద సవాల్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ అప్పీల్ను స్వీకరించి విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం.. తాజాగా సింగిల్ జడ్జి తీర్పును నిలిపివేస్తూ మధ్యంతరం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో షెడ్యూల్ ప్రకారమే కరీంనగర్ కార్పొరేషన్లోనూ ఎన్నికలు జరగనున్నాయి.