27.7 C
Hyderabad
May 4, 2024 09: 22 AM
Slider మహబూబ్ నగర్

కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం

#KCR effigy

యూత్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కెసిఆర్ దిష్టిబొమ్మని దగ్ధం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో బుధవారం యూత్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ వార్ రూమ్ పై తెలంగాణ పోలీసులు దాడికి నిరసనగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దిష్టిబొమ్మను యూత్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కాయతి విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో పోలీసులు అధికార పార్టీ తొత్తులుగా పనిచేస్తున్నారని, రాష్ట్రంలో అధికార పార్టీ చేస్తున్న దుష్ట రాజకీయాలను బట్టబయలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి భయభ్రాంతులకు గురవుతూ తన బండారం ఎక్కడ బయటపేడుతుందోనని కక్ష సాధింపు చర్యగా అధికార పార్టీ వ్యవహరిస్తుందంటూ, అందరికీ తెలిసిన విషయమే సోషల్ మీడియాలో పెడితే తప్పేంటని పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణలో కేసీఆర్ దక్షిణ భారత హిట్లర్ గా వ్యవహరిస్తున్నారని, కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ కార్యాలయంలో అర్ధరాత్రి దాడులు చేయడం ఏమిటని ప్రశ్నించారు.

ఏలాంటి తనిఖీకి సంబంధించిన సమన్లు లేకుండా కార్యాలయంలోకి రావటమేంటని కంప్యూటర్లు తీసుకపోవడమేంటని పోలీసులపై మండిపడ్డారు.సునీల్ కనుగొను కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి బ్యాక్ బోన్ గా కృషి చేస్తున్న ఆయన కార్యాలయంపై దాడులు చేయడం సిగ్గుచేటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకోవడం కేసీఆర్ కు మింగుడు పడటం లేదని తెలిపారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నేన నీ ప్రజలు గుర్తించారని తెలంగాణ సాధనలో కేసీఆర్ కుటుంబీకుల ఏలాంటి ప్రమేయం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కొత్తపేటలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు

Satyam NEWS

మార్పు కోసం కొల్లాపూర్ ప్రజల తిరుగుబాటు చేసి నేటికి రెండేళ్లు

Satyam NEWS

కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా తుంగభద్ర పుష్కరాలకు ఏర్పాట్లు

Satyam NEWS

Leave a Comment