ఈ నెల 26న భారత రాష్ట్ర పతి ద్రౌపదీ ముర్మూ శ్రీశైలం పర్యటనకు వస్తున్నారు. అచ్చంపేట మీదుగా ఆమె శ్రీశైలంకు చేరుకుంటారని సమాచారం. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి దర్శనార్థం రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ఈనెల 26న శ్రీశైలం రానున్నారు. అచ్చంపేట మీదుగా రాష్ట్రపతి వెళ్లనున్నారు. 26న మధ్యాహ్నం 12.15 గంటలకు శ్రీశైలం చేరుకుని, స్వామి అమ్మవార్లను ఆమె దర్శించుకుంటారు.
‘ప్రసాద్’ స్కీం ద్వారా శ్రీశైలంలో భక్తుల సౌకర్యార్థం నిర్మించిన పలు భవనాలను ప్రారంభోత్సవం నిర్వహించి అనంతరం రాష్ట్రంలో పర్యటించనున్నట్లు సమాచారం.